నేడు సుప్రీంలో అయోధ్య కేసు

-

అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు పుననిర్మాణం కేసుకు సంబంధించిన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఈ కేసుని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి, జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌లతో ధర్మాసనం విచారించనుంది. అయోధ్య వివాదంపై గతంలో దాఖలైన 4 సివిల్‌ వ్యాజ్యాలపై అలహాబాద్‌ హైకోర్టు 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్‌లల్లాలకు సమానంగా పంచాలని పేర్కొంటూ 2010 తీర్పు వెలువరించింది.

దీంతో తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన ఈ 14 విజ్ఞాపనలపై  నేడు కీలక ఆదేశాలు జారీ చేయనుంది. అయితే అత్యవసర విచారణ చేపట్టాలని గతంలో కోరినప్పటికీ సుప్రీం తిరస్కరించింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version