రియా చక్రవర్తికి శివసేనకు సంబంధాలు ఉన్నాయి..

-

సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య చేసుకున్న నాటి నుంచి కూడా ఏదోక సందర్భంలో ఏదోక వార్త అతని మరణానికి సంబంధించి వస్తూనే ఉన్నాయి. తాజాగా సుశాంత్ స్నేహితుడు సునీల్ శుక్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రియా చక్రవర్తికి, శివసేన పార్టీకి లింక్ ఉందని ఆరోపించారు. దీనిపై విచారణ కూడా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సునీల్ చెప్పిన దాని ప్రకారం…

Riya

రియా చక్రవర్తి లోనావాలాలోని… పవానా ఫామ్‌హౌస్ సమీపంలో ప్లాట్లు కొనాలనుకున్నారు. రియా అటవీ మంత్రిత్వ శాఖతో సన్నిహితంగా ఉన్నారని, మంత్రి సంజయ్ రాథోడ్‌ను కూడా కలిశారని ఆయన పేర్కొన్నారు. అయితే లాక్డౌన్ కారణంగా వారు ఒప్పందాన్ని ఖరారు చేయలేదని శుక్లా చెప్పారు. అసలు నిజాన్ని బయటకు లాగడానికి వారిని విచారించాలి అని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version