హైదరాబాద్‌లో వివాహిత అనుమానాస్పద మృతి.. ఒంటిపై గాయాలు!

-

హైదరాబాద్‌లో వివాహిత అనుమానాస్పద మృతి చెందింది. మలక్‌పేట జమున టవర్స్‌లో నివాసం ఉంటున్న సింగం శిరీష మృతి కలకలం రేపింది. గుండెపోటుతో చనిపోయిందని ఆమె భర్త వినయ్ కుమార్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు సమాచారం.

అత్తమామలు,మృతురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరకముందే మృతదేహాన్ని సొంత గ్రామం శ్రీశైలం సమీపంలోని0 దోమల పెంటకు అంబులెన్సులో తరలిస్తుండగా సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించి మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.మృతదేహం పై గాయాలు ఉండటంతో కొట్టి చంపి..గుండెపోటుగా చెబుతున్నారని మలక్‌పేట పోలీసులకు మృతురాలి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version