ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులు అలాగే తల్లిదండ్రులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. రేపు తల్లికి వందనం రెండో విడత డబ్బులు రిలీజ్ చేయబోతోంది. రేపు ఒక్కరోజే మరో 9.51 మందికి తల్లికి వందనం…. పథకం నిధులు విడుదల చేయనుంది.

ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్టియర్, కేంద్రీయ విద్యాలయాలు, సీబీఎస్సీ, నవోదయ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ నిధులు జమ చేయబోతోంది. అలాగే వార్డు, సచివాలయ కార్యాలయాలకు వచ్చిన ఫిర్యాదుల ద్వారా… మరికొంతమంది ఈ పథకానికి అర్హులని తేలింది. దింతో దాదాపు 1.34 లక్షల మంది కొత్తగా అర్హులు అయ్యారు. వీళ్ళందరికీ రేపు నగదు విడుదల చేయనుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం.