కూన రవికుమార్ కు స్పీకర్ తమ్మినేని కుమారుడు వార్నింగ్

-

ఆమదాలవలసలో మేనమామ వర్సెస్ మేనల్లుడు వార్ మొదలయింది. టీడీపీ నేత కూన రవికుమార్ కు స్పీకర్ తమ్మినేని కుమారుడు చిరంజీవి నాగ్ వార్నింగ్ ఇచ్చారు. కూనరవి ఓడిపోయిన ఫ్రస్టేషన్ లో ఉన్నాడని, బయట ఊరి నుంచి మనుషులను తెప్పించుకుని తన సొంత ఊరిలో దాడులు చేయించారు నాగ ఆరోపించారు. పెనుబర్తి లో వైసీపీ నేత కార్లు, ఏసీలు ధ్వంసం చేయించారని, తాను లేకపోతే ప్రజాస్వామ్యం లేదని కూనరవి నీతులు వల్లిస్తున్నాడని ఆయన విమర్శించారు.

పెనుబర్తిలో వైసీపీ నేతల పై దాడి చేయించలేదని చెప్పే దమ్ము కూనరవికి ఉందా ? అని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును ఎవరైనా గౌరవించాలి, మా నాన్న ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు .. మూడు సార్లు ఓడిపోయాడు, ఈ లెక్కన మేం ఎంతమందిని మర్డర్లు చేయాలి ? అని ఆయన ప్రశ్నించారు. కూనరవి ప్రస్టేషన్ లో మతిస్థిమితం కోల్పోతున్నారని, మీనాయకుడు స్టే ఫ్రీ బాబు గా పేరు తెచ్చుకుంటే, నువ్వేమో బెయిల్ రవికుమార్ గా పేరు తెచ్చుకున్నావని అన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version