టార్గెట్ తెలంగాణ : నేడు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి రాక

-

ఈ రోజు హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్‌ చుగ్ పర్యటించనున్నారు. బీజేపీ ఇన్‌చార్జ్ ‌లతో రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ  బలోపేతం నాయకులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఆయన సమక్షంలో కంటోన్మెంట్ మాజీ వైస్ ఛైర్మన్ జంపన ప్రతాప్, తెలుగుదేశం కంటోన్మెంట్ ఇన్‌చార్జ్ ముప్పిడి ముధుకర్‌లు బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం.  ఇక ఇంచార్జి గా నియమించాక మొదటి సారి రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపధ్యంలో సర్వత్రా ఉత్కంట నెలకొంది.

ఈ రోజు రేపు రెండు రోజులు పాటు తరుణ్ చుగ్ ఇక్కడే ఉండనున్నారు. కాసేపట్లో  గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసిన కార్పొరేటర్ అభ్యర్థులతో సమావేశం కానున్న ఆయన ఆ తర్వాత గ్రేటర్ పరిధిలోని జిల్లాల అధ్యక్షులు ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. అనంతరం మోర్చాల అధ్యక్షులు, ఇంచార్జిలతో సమావేశం కానున్న ఆయన మధ్యాహ్నం మూడు గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఎల్లుండి రాష్ట్ర పదాధికారులు, కోర్ కమిటీతో సమావేశం కానున్నారు ఆయన.

Read more RELATED
Recommended to you

Exit mobile version