రాజేంద్రనగర్ తెదేపాకే దక్కింది…

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిలో భాగస్వామి అయిన తెదేపా తమ అభ్యర్థుల రెండో జాబితాను బుధవారం రాత్రి విడుదల చేసింది. మహాకూటమిలో భాగంగా టీడీపీకి 14 సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇందులో 9 స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా, తాజాగా మరో రెండు స్థానాలకు అభ్యర్థులను పేర్లను  ఖరారు చేసింది. ఇబ్రహీంపట్నం నుంచి సామ రంగారెడ్డిని, రాజేంద్ర నగర్ నుంచి గణేష్ గుప్తాను బరిలోకి దింపుతున్నట్లు తెదేపా  అధిష్టానం ప్రకటించింది. దీంతో టీడీపీ మరో మూడు స్థానాలకు అభ్యర్థులను పెండింగ్‌లో ఉంచింది.  కూకట్ పల్లి స్థానాన్ని నందమూరి కుటుంబంలోని వారికి కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version