జగన్ ను అభాసుపాలు చేయడానికి టీడీపీ కుట్ర చేస్తుందా…?

-

ఇంగ్లీష్ విషయంలో జగన్ ను అభాసుపాలు చేయడానికి టీడీపీ చూస్తుందా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. ఇంగ్లీష్ మీడియం నిర్ణయం జగన్ తీసుకోవడం మొదలు అక్కడి నుంచి చంద్రబాబు అనుకూల మీడియా, టీడీపీ సోషల్ మీడియా క్యాడర్ పదే పదే మాతృ భాష ఘోష అంటూ రాతలు రాయడం మొదలు పెట్టారు. జగన్ ఎంతకు వెనక్కు తగ్గకపోవడంతో ఇప్పుడు మత ప్రచారం అనే దానిని హైలెట్ చేస్తూ కథనాలు రాస్తున్నారు. ఇక వినని వారి మీద జగన్ ఎదురు దాడి చేస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

అసలు వాస్తవాలు అనేది ఎక్కడా మాట్లాడటం లేదు. సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. ఈ సమావేశాల్లో టీడీపీ ఎంపీ కేశినేని నాని ఇంగ్లీష్ విషయాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఇక అక్కడి నుంచి జాతీయ నేతలు ఆరా తీశారు… రాజకీయ కారణాలు, ఇతరత్రా కక్షలతో ఇంగ్లీష్ ను తీసుకురావడం ఏంటి అని వాళ్ళు మండిపడ్డారంటూ కథనాలు రాయడం మొదలుపెట్టింది చంద్రబాబు అనుకూల మీడియా. ఇప్పుడు ఈ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోవాలని, జోక్యం చేసుకోవాలని అంటున్నారు.

అసలు దాని గురించి అంత అల్లరి చెయ్యాల్సిన అవసరం టీడీపీ నేతలకు ఎందుకు ఉంది అనేది అర్ధం కాకపోయినా… రాష్ట్రంలో పలు పరిణామాలకు, తిరుమల నిర్ణయాలకు దానిని జోడించి చంద్రబాబు బ్యాచ్ వైసీపీ మీద ఫిర్యాదు చేయడానికి సిద్దమవుతుంది. జాతీయ స్థాయిలో ఈ సమస్యను తీసుకువెళ్లడం ద్వారా మాతృ భాషను జగన్ చంపేస్తున్నారని, భాషా ప్రాతిపదికకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే భారత్ లాంటి అత్యున్నతమైన దేశంలో ఇలాంటి నిర్ణయాలు వ్యతిరేక పవనాలకు తీసుకువెళ్తామని, ఒరియా, తమిళం, కన్నడం, హిందీని చూసి నేర్చుకోవాలని కొందరు చెప్పినట్టు చంద్రబాబు అనుకూల మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version