టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశం ప్రారంభం..

-

టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం టిడిపి పొలిట్‌ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమావేశంలో సంస్థాగత ఎన్నికలు, పార్టీ కమిటీల ఏర్పాటు తదితర 13 అంశాలతో ఎంజెండా రూపొందించి వాటిపై చర్చించాలని నిర్ణయించారు.

టీడీపీ ప్రభుత్వం హయాంలో అమలైన పథకాల నిలిపివేత, టీడీపీ నేతలపై అక్రమ కేసుల అంశాలపైనా పొలిట్‌ బ్యూరో సీరియస్‌ చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఎలా సంసిద్ధం కావాలన్న అంశంపై చర్చించి పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేసే కార్యాచరణ రూపొందిచనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version