హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “తీస్ మార్ ఖాన్” రిలీజ్ డేట్ ఫిక్స్

-

టాలీవుడ్ సీనియర్ హీరో సాయికుమార్ నటన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎమోషనల్ సీన్స్ లో సాయి కుమార్ నటనకు ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇక ఆయన డైలాగ్ డెలివరీకి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాగా, ఆయన తనయుడు ఆది సాయి కుమార్ ఈ సారి సాయి కుమార్ మాదిరిగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ తనదైన స్టైల్ లో ప్లే చేశారు. ‘తీస్ మార్ ఖాన్’గా ఆది సాయి కుమార్..త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో ఆదిసాయికుమార్ కు జోడీగా బోల్డ్ బ్యూటీ RX 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్ నటించింది.

కల్యాణ్ జీ గోగన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని విజన్   సినిమాస్ బ్యానర్ పై నాగం తిరుపతిరెడ్డి ప్రొడ్యూస్ చేశారు. సునీల్, పూర్ణ, కబీర్ దుహాన్ సింగ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ తీస్ మార్ ఖాన్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 19న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నామని ప్రకటించారు దర్శకనిర్మాతలు. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై ఆసక్తి పెంచేశాయి. అదేవిధంగా ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ టీజర్ లోని ప్రతి సన్నివేశం కూడా మూవీ ఎప్పుడెప్పుడు చూడాలా అనే ఆతృతను పెంచేసింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version