మరికాసేపట్లో తెలంగాణ కేబినెట్‌ భేటీ..50 వేల ఉద్యోగాలపై కీలక ప్రకటన !

-

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ప్రగతిభవన్‌లో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఈ కేబినెట్‌ సమావేశం ప్రారంభం కానుంది. అయితే… ఇటీవల పలు దఫాలుగా దళితబంధుపై చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం… ఈ పథకానికి తగిన మార్గదర్శకాలను రూపొందించడం, వీలైనంత తొందరగా అమలులోకి తీసుకురావడం, బడ్జెట్ కేటాయింపులు చేయడం తదితర అంశాలను ఇవాళ భేటీ కానున్న మంత్రి వర్గం సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

cm-kcr

దళితవాడల్లోని సమస్యలు, అర్హుల జాబితాను అధికారులు సేకరిస్తున్నారు. మరోవైపు దళిత బీమాపై కూడా చర్చించనున్నారు. ఇక చేనేతలకు బీమాపై సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన తరుణంలో దానిపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు 50 వేల ఉద్యోగాల భర్తీ అంశంపై కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. వీటితోపాటు పంటల సాగు, ప్రాజెక్టుల తదితర అంశాలపై చర్చించనుంది. కేంద్రం కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గెజిట్ విడుదల చేసిన అంశం కూడా కేబినెట్‌ ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version