తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా…. కొత్తగా 578 కేసులు..

-

తెలంగాణ లో కరోనా తీవ్రత భారీగా తగ్గుతోంది. తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 24 గంటల్లో 578 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 6, 36, 627 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 03 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు 3759 మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసులు 9,824 గా ఉన్నాయి.

ఇక ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 6,23,044 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. గత 24 గంటల్లో 731 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో రికవరీ రేటు 97.86 శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 97.28 శాతంగా ఉంది. తెలంగాణలో మరణాలు 0.59% గా ఉన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 90,966 పరీక్షలు చేశారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పరీక్షలు సంఖ్య 2,05,29,888 కు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version