తెలంగాణా కరోనా : 1,440 కేసులు, 5 మరణాలు

-

తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్న కరోనా కేసులు కొద్ది రోజులుగా మళ్ళీ పెరుగుతున్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 1,440 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,50,331 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో ఐదుగురు మరణించారు. ఇప్పటి వరకు 1377 మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 19,890గా ఉన్నాయి.

carona telangana

వారిలో 17,135 మంది హోం ఐసోలేషన్‌ లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 2,29,064 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 1,481 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 91.50% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 92.4% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.55%గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 42,673 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 46,18,470 పరీక్షలు చేసారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా 278 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version