తెలంగాణ హోం మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం

-

తెలంగాణ హోం మంత్రి మహమూద్‌ ఆలీకి తృటిలో ప్రమాదం తప్పింది. ఇవాళ ఉదయమే సికింద్రాబాద్‌ ప్రాంగంణలోని బోయివాడలో.. ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ ప్రమాద ఘటనను తెలంగాణ హోం మంత్రి మహమూద్‌ ఆలీ… పరిశీలించారు. ఇందులో భాగంగానే.. గోదాంలోకి వెళ్లి.. అక్కడి పరిస్థితులను చూశారు.

అయితే.. ఆయన బయటకు రాగానే.. గోదాం కుప్పకూలింది. ఒక 2 నిమిషాలు ఆలస్యం అయితే… ఘోర ప్రమాదమే జరిగేది. ఒక వేళ ఆ ప్రమాదం జరిగి ఉండుంటుంటే.. తెలంగాణ హోం మంత్రి మహమూద్‌ ఆలీతో పాటు ఇతర అధికారులకు ఘోర ప్రమాదం జరిగేది. అయితే.. ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బోయిగూడ స్క్రాప్‌ గోడౌన్‌లో అగ్నిప్రమాదం ఘటనలో 11 మంది కార్మికులు సజీవదహనం కాగా… ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి తలసాని.. అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశించారు. అటు బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌ గ్రేషియా ప్రకటించింది కేసీఆర్‌ సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version