దేశంలో చీప్ లిక్కర్ తీసుకువచ్చిన…చీప్ వ్యక్తి చంద్రబాబు నాయుడు: కొడాలినాని

-

భారతదేశం చీప్ లిక్కర్ ను కనిపెట్టిన వాడు చీప్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మంత్రి కోడాలి నాని విమర్శించారు. 240 బ్రాండ్లకు పర్మిషన్లు ఇచ్చిన నీచుడు చంద్రబాబు నాయుడని తీవ్రంగా విమర్శించారు. అల్జీమర్స్ వచ్చి చంద్రబాబు నాయుడికి పిచ్చేక్కుతోందని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 45 వేల బెల్ట్ షాపులను రద్దు చేశారని గుర్తు చేశారు. పర్మిట్ రూంలను క్యాన్సల్ చేశారని అన్నారు. బడులు, గుడుల వద్ద ఉన్న వైన్స్ షాపులను తగ్గించిన ఘనత జగన్ మోహన్ రెడ్డిదే అని కొడాని నాని అన్నారు. చంద్రబాబు నాయుడు దిగిపోయే సందర్భంలో బార్లకు అనుమతి రెన్యూవల్ చేశారని.. అన్నారు. ఎన్టీఆర్ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తే… రామారావుగారికి వెన్నుపోటు పొడిచి.. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ ను రాష్ట్రంలో ప్రవేశపెట్టిన నీచుడు చంద్రబాబు నాయుడని… 420 అంటూ అసెంబ్లీలో విమర్శించారు. తెలుగు దేశం పార్టీకి సిగ్గూ శరం లేదు అని ఆయన విమర్శించారు. తెలంగాణలో టీడీపీకి పట్టిన గతే..ఏపీలో జరుగుతుందని ఆయన అన్నారు. జగన్ మోహన్ రెడ్డిపై ఏరకమైన విమర్శలు చేసే అవకాశం లేకే.. ఇలా అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని కొడాలి నాని అన్నారు. మీరన్నా పార్టీ మారండి.. లేకపోతే చంద్రబాబు నాయుడు అయినా మార్చాలని టీడీపీ ఎమ్మెల్యేలను కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version