తెలంగాణ పోలీస్‌ దేశంలోనే నెంబర్‌ వన్‌ : హోంమంత్రి మహమూద్‌ అలీ

-

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో అత్యాధునిక వసతులతో నిర్మించిన పోలీస్‌స్టేషన్‌ను మంత్రి డీజీపీ అంజనీకుమార్‌, ఎంపీ రంజిత్‌రెడ్డి, పోలీస్‌ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ కలిసి ప్రారంభించారు. ఇక్కడికి హోంమంత్రి మహమూద్‌ అలీ ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రసంగిస్తూ, తెలంగాణ పోలీస్‌ వ్యవస్థ దేశానికే రోల్‌ మోడల్‌ అని అన్నారు. శాంతిభద్రతల రక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే ముందంజలో ఉన్నారని పేర్కొన్నారు మంత్రి.

చేవేళ్ల పోలీస్‌స్టేషన్‌ను అత్యాధునిక హంగులతో నిర్మించామన్నారు. పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని కోరారు. నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన స్టేషన్లకు సంబంధించిన సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుతో పోలీసులు విజయవంతమయ్యారన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version