ఆ విషయంలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ వెయ్యి రెట్లు నయం : మంత్రి తుమ్మల

-

రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ సర్కార్ వెయ్యి రెట్టు నయం అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతేడాది కన్నా ముందే భారీ ఎత్తున కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. గత ప్రభుత్వంతో పోల్చి చూస్తే సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా కొనుగోలు చేశామని వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు, మిల్లలకు తరలింపుపై ఎప్పటికప్పుడు అధికారులతో సమావేశం అవున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేసేలా ధాన్యం కొనుగోళ్లలో తరుగు, తాలు పేరిట కోతలు ఎక్కడా లేవని అన్నారు. గతంలో క్వింటాకు 7 నుంచి 10 కిలోల వరకు తరుగును తిశారని ఆయన ఆరోపించారు. పంట కొనుగోలు చేసిన కేవలం ఐదు పని దినాల్లో రైతుల ఖాతాల్లో నగదును జమ చేస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version