భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు !

-

కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి నడుస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ టికెట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమ్ముకున్నాడంటూ స్పష్టమైన ఆధారాలతో మేము పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్ళాం, వివిధ రూపాల్లో నిరసన తెలియజేశాము. ఇందుకుగాను మమ్మల్ని పార్టీ నుంచి ఎలాంటి సంజాయిషీ లేకుండా సస్పెండ్ చేశారు.

రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నాడని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసేందుకు  నిన్న మధ్యాహ్నం ఒంటిగంటకు టీపీసీసీ మాజీ కార్యదర్శి డాక్టర్ కురువ విజయ్ కుమార్ గద్వాల నియోజకవర్గం, రాగిడి లక్ష్మారెడ్డి ఉప్పల్ నియోజకవర్గం మరియు ఖలీమ్ బాబా బహుదూర్ నియోజకవర్గం భాగ్యలక్ష్మి అమ్మవారి గుడిదగ్గర కు వెళ్లి పూజలు చేసిన అనంతరం చార్మినార్ దగ్గర రేవంత్ రెడ్డి కి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేసారు.

ఈ సందర్బంగా కురువ విజయ్ కుమార్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి హటావ్ తెలంగాణ కాంగ్రెస్ బచావ్ అంటూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారు. గద్వాల MLA టికేట్ తో పాటు తెలంగాణ లోని MLA టికెట్లను అమ్మలేదు అని నీ మనమడిని తీసుకొని భాగ్యలక్ష్మి అమ్మవారి గుడిదగ్గరికి వచ్చి అమ్మవారి మీద ప్రమాణం చేయాలని ఈ సంధర్బంగా డా.కురువ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version