Telangana: విద్యార్థులకు అలర్ట్.. గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ జిల్లాల్లో సెలవు

-

Telangana: తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు అలర్ట్.. గణేశ్ నిమజ్జనం సందర్భంగా విద్యార్థులకు సెలవు ప్రకటించారు అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో గణేష్ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 11 రోజులపాటు విశేష పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గణనాథుని మండపాల వద్ద సంబరాలు జరుపుకున్నారు.

Alert for Telangana students Holidays in these districts on the occasion of Ganesh immersion

ఇక ఈ నెల 17వ తేదీన గణేష్ నిమజ్జనం జరగనుంది. గణేష్ నిమజ్జనం సందర్భంగా పలు జిల్లాల్లో కొన్ని పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలతో పాటుగా…. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలకు సెలవు ప్రకటిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సెలవు ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, కళాశాలలకు మాత్రమే వర్తిస్తుందని తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news