వాహనదారులకు అలెర్ట్.. రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ మల్లింపులు ఉండనున్నాయి. జూన్ 2 తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు పరేడ్ గ్రౌండ్ గన్ పార్క్ లో ఆవిర్భావ వేడుకలు నిర్వహించబోతున్నారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్ ను మళ్ళించనున్నారు. రవీంద్ర భారతి వద్ద ఇక్బాల్ మినార్ జంక్షన్ వైపు, నాంపల్లి నుంచి రవీంద్రభారతి వైపు ట్రాఫిక్ ను అనుమతించరు.

AR పెట్రోల్ పంపు వద్ద బషీర్ బాగ్ BJR విగ్రహం వైపు ట్రాఫిక్ ను మళ్ళించనున్నారు. ప్యాట్నీ నుంచి తిరుమలగిరి వైపు వచ్చే ట్రాఫిక్ ను YMCA, స్వీకార్ – ఉపకార్ టికెట్ వైపు మళ్లీస్తారు. ఇది ఇలా ఉండగా….. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో.. పలు సంక్షేమ పథకాలు అలాగే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రాజీవ్ యువ వికాసం నిధులను కూడా రేపటి రోజున విడుదల చేసే ఛాన్సులు ఉన్నాయి.