ఆలేరు ఎమ్మెల్యే గోంగిడి సునీతకు తెలంగాణ హైకోర్టు జరిమానా

-

ఆలేరు ఎమ్మెల్యే గోంగిడి సునీత మహేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఊహించని షాక్ తగిలింది. ఆలేరు ఎమ్మెల్యే గోంగిడి సునీత మహేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు రూ. 10వేల జరిమానా విధించింది. 2018 ఎన్నికల అఫీడవిట్ లో ఆస్తులను చూపకుండా, తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు అయింది.

Aleru MLA Gongidi Sunita fined by Telangana High Court

ఈ పిటిషన్ లో ఆలేరుకు చెందిన బోరేడ్డి అయోధ్య రెడ్డి ఇంప్లీడ్ అయ్యారు. దీనిపై ఈరోజు హైకోర్టు లో విచారణకు రాగా… 2018కి చెందిన కేసులు ఇప్పటివరకు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో గొంగిడి సునీతకు పదివేల రూపాయల జరిమానా న్యాయస్థానం విధించింది అక్టోబర్ 3లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 3కు హైకోర్టు వాయిదా వేసింది. గొంగిడి సునీత ఎన్నిక చెల్లదని సైని సతీష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version