కాంగ్రెస్ పార్టీలోకి పైళ్ళ శేఖర్ రెడ్డి… వద్దంటున్న ఎమ్మెల్యే కుంభం అనిల్ ?

-

యాదాద్రి జిల్లా భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికపై… ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న వార్తలు కేడర్ను ఆందోళనకు గురి చేస్తున్నాయని వెల్లడించారు అనిల్. నేను ప్రజల మధ్య తిరుగుతుంటే.. కొందరు నేతలు పార్టీలో చేరడంపై దృష్టి పెట్టారు.

ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసానని చెప్పారు. ఈ విషయంపై గాంధీభవన్ లో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ దీపాదాస్ మున్షీని కూడా కలిసా..అధికారం లేకుంటే మూడు నెలలు కూడా ఉండలేరా..? అంటావు ఆగ్రహించారు. ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలపై 8 సంవత్సరాల కొట్లాడిన..ఎమ్మెల్యే కంటే ప్రతిపక్ష బాధ్యతే గొప్పదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రజలకు అండగా నిలబడే అవకాశం ప్రతిపక్షానికి దక్కుతుంది….అధికారంలో ఉంటే అడిగిన వారందరికీ సమాధానం చెప్పాలని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version