గువ్వల బాలరాజుపై మరోసారి దాడి..ఆస్పత్రికి తరలింపు

-

అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై మరోసారి దాడి జరిగింది. నిన్న అర్ధరాత్రి నల్లమల అచ్చంపేట లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు..గాయపడ్డారు. అంతేకాదు.. ఈ ఘర్షణలో గువ్వలకు మెడపై గాయలయ్యాయంటూ… చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బీఆర్‌ఎస్‌ నేతలు. ఓ వాహనంలో డబ్బుల బ్యాగ్ లను తరలిస్తున్నారనే సమాచారంతో వెంబడించారు కాంగ్రెస్ నేతలు.

another attach on Guvvala Balaraju
another attach on Guvvala Balaraju

ఆ వాహనం గువ్వల బాలరాజు ఉన్న ప్రాంతానికి వెళ్లి ఆగిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగాయి కాంగ్రెస్ శ్రేణులు. అయితే..ఈ ఘర్షణలో టవెరా వాహనం అద్దాలు పగలగొట్టారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజు రాత్రి 10 తర్వాత ప్రచారం చేస్తూ డబ్బులు పంచుతున్నారంటూ ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ. స్థానిక పోలీసులు, గువ్వల గన్ మెన్ లు, గువ్వల ఎస్కార్ట్ పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కు సపోర్ట్ చేస్తున్నారంటూ ఆగ్రహించిన వంశీకృష్ణ..ఈ ఘటన పై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలను చెదరగొట్టారు పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Latest news