గద్దర్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేయడం అవమానం !

-

గద్దర్ కు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని నిర్ణయించడం నక్సలైట్ ( మావోయిజం ) వ్యతిరేఖ పోరాటంలో అమరులైన పోలీసుల, పౌరుల త్యాగాలను అవమానించడమేనని యాంటి టెర్రరిజం ఫోరం కన్వీనర్ రావినూతల శశిధర్ ఫైర్ అయ్యారు. గద్దర్ తన విప్లవ పాటల ద్వారా వేలాది మంది యువకులను నక్సలైట్ ఉద్యమం వైపు మళ్ళించిన వ్యక్తి అని… ప్రజాస్వామ్యానికి వ్యతిరేఖంగా తుపాకీ పట్టిన నక్సల్స్ ఉద్యమం వేలాది మంది పోలీసులను బలితీసుకుందని విమర్శలు చేశారు.

నక్సలిజం ( మావోయిజం ) సాధారణ పౌరులపై మరియు జాతీయ వాదులపై కూడా దాడులు జరిపి అనేక మందిని బలితీసుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేఖంగా సాయిధ పోరాటాలు చేయడానికి తన సాహిత్యం ద్వారా యువతను దేశ ద్రోహులుగా తయారు చేసిన గద్దర్ లాంటి ఒక వ్యక్తికి నేడు తెలంగాణా ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు చేయాలని నిర్ణయించడం తీవ్రంగా ఖండించదగిన చర్య అన్నారు యాంటి టెర్రరిజం ఫోరం కన్వీనర్ రావినూతల శశిధర్. ప్రభుత్వ నిర్ణయం ప్రజాస్వామ్య పరిరక్షణలో మరియు శాంతి భధ్రతల పరిరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను మరియు ప్రజల త్యాగాలను అవమానించడమే అవుతుంది. ప్రభుత్వ నిర్ణయం పోలీసు బలగాల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version