మహిళా జర్నలిస్టుల మీద జరిగిన దాడి.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు !

-

రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న రుణమాఫీ పై రైతుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొండారెడ్డిపల్లి వెళ్లారు మహిళా జర్నలిస్టులు. ఆ మహిళా జర్నలిస్టులపై పట్టపగలే దాడి జరిగింది. కాంగ్రెస్‌కు చెందిన కొంత మంది వారిని చుట్టు ముట్టి అసభ్యంగా ప్రవర్తించారు. ఇక్కడ మీకేం పని అంటూ దౌర్జన్యానికి దిగారు. వారు రికార్డు చేసిన దృశ్యాలు బయటకు రాకుండా మెమొరీకార్డులు లాక్కున్నారు.

ఇక ఈ విషయం పోలీస్‌ స్టేషన్‌కు చేరాక కూడా వారిపై వేధింపులు ఆగలేదు. పోలీస్‌ స్టేషన్‌లోనే ఒకరు జర్నలిస్టుల్లో ఒకరిపై దాడికి యత్నించాడు. అయినప్పటికీ పోలీసులు చోద్యం చూశారు. తాజాగా ఈ ఘటన పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మీరు ఎక్కడికిబడితే అక్కడికి పోయి ఇష్టం వచ్చినట్లు అలా చేస్తానంటే నేచురల్ రియాక్షన్ ఉంటది అని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కొంత మంది జర్నలిస్టులు సీఎం తీరుపై మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version