ఇవాళ మధ్యాహ్నం సాయి చంద్ అంత్యక్రియలు – బాల్క సుమన్‌

-

ఇవాళ మధ్యాహ్నం సాయి చంద్ అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ప్రకటించారు. సాయి చంద్ నాకు అత్యంత ఆత్మీయుడు అని… లక్షలాది మందిని తన పాటతో ఉర్రూతలూగించిన సాయి లేరనే మాట జీర్ణించుకోలేక పోతున్నామని తెలిపారు బాల్క సుమన్.

అజత శత్రువు సాయి చంద్ అని… ఇవాళ మధ్యాహ్నం తర్వాత సాహెబ్ నగర్ లో తన అంత్యక్రియలు జరుగుతాయన్నారు. ఇంకా తన ఊరు నుంచి చాలా మంది వస్తున్నారన్నారు బాల్క సుమన్. ఇవాళ మధ్యాహ్నం 1 గంట వరకు అందరూ వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తామని వివరించారు. సీఎం కెసీఆర్ కు కూడా ఈ విషయం తెలియజేసామని…ఆయనకు కూడా వస్తారన్నారు బాల్క సుమన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version