కాంగ్రెస్ మునిగిపోయే నావ…అందులో ఎందుకు చేరుతున్నారు – బండి సంజయ్‌

-

కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, కాంగ్రెస్ ను నడిపించేది కేసీఆరేనని అన్నారు. అట్లాంటప్పడు కేసీఆర్ ను ఓడించడమే ధ్యేయమని చెబుతున్న నేతలు కాంగ్రెస్ లో ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.

బీఆర్ఎస్ ను ఓడించే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రజల్లో విలువ లేదని కేటీఆరే చెబుతున్నారని.. ఆత్మాభిమానమున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆలోచించుకోవాలని సూచించారు. తెలంగాణపై జరిగిన ఓటింగ్ కు రాకుండా తాగి పడుకున్నడు. ఖమ్మంలో దొంగ దీక్ష చేసి తాగి పడుకున్నాడని ఫైర్ అయ్యారు. సిగ్గులేకుండా చావు నోట్లో తలకాయ పెట్టి వచ్చినట్లు చెప్పుకుంటున్నడు… నువ్వు చావు నోట్లో కాదు… మందు సీసాను నోట్లో పెట్టుకుని వచ్చావంటూ మండిపడ్డారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version