పాదయాత్ర పై నేడు బండి సంజయ్ కీలక సమావేశం

-

ఆగస్టు 2 నుంచి బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నేడు బండి సంజయ్ నేడు పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో భేటీ కానున్నారు. పాదయాత్రకు సంబంధించి ఏర్పాట్లు తదితర అంశాలపై వారు చర్చించనున్నారు. కాగా ఆగస్టు 2 నుంచి 26వ తేదీ వరకు బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర కొనసాగనంది.

bandi-sanjay

యాదగిరిగుట్ట నుంచి వరంగల్ భద్రకాళి దేవస్థానం వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఆగస్టు రెండవ తేదీన యాదగిరిగుట్టలో బహిరంగ సభకు బిజెపి అధిష్టానం ప్లాన్ చేస్తోంది. బహిరంగ సభకు జాతీయస్థాయిలోని ముఖ్య నేతలను పిలవాలని నిర్ణయం తీసుకుంది. ఈ పాదయాత్ర మొత్తం 328 కిలోమీటర్ల మేర జరగనుంది. ఆగస్టు 26న పాదయాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version