ఉత్తర కొరియా కిమ్ ను కేసీఆర్ మించిపోయాడు – బండి సంజయ్

-

ఉత్తర కొరియా కిమ్ ను కేసీఆర్ మించిపోయాడని బీజేపీ ఛీప్‌ బండి సంజయ్ ఫైర్‌ అయ్యారు. ‘తెలంగాణ దేశానికి మోడల్ అట…. దేనికి మోడల్ కేసీఆర్ ? రైతుల ఆత్మహత్యల్లోనా…. ఫ్రీ యూరియా, రుణమాఫీ, విత్తనాల పేరుతో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాట తప్పడంలోనా…..? రైతు బంధు పేరుతో అన్ని సబ్సిడీలు బంద్ చేయడంలోనా?’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు.

కేసీఆర్ ది కిసాన్ సర్కార్ కాదని…తెలంగాణ ప్రజలను, నిరుద్యోగుల కొంపలు ముంచే సర్కార్ అని మండిపడ్డారు. ఢిల్లీ దొంగ సారా దందాలో సుఖేష్ చంద్రశేఖర్ బీఆర్ఎస్ పార్టీకి రూ.75 కోట్లు ఇచ్చిన విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటంతో ఆ చర్చను దారి మళ్లించేందుకు మహారాష్ట్ర రైతుల జాయిన్సింగ్స్ పేరుతో డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కు చెందిన బీఆర్ఎస్ సహా ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ పై ఫైర్‌ అయ్యారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version