షర్మిల చేరికపై భట్టి విక్రమార్క కీలక ప్రకటన

-

ఢిల్లీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయని.. ఇతర పార్టీల్లో స్వేచ్ఛ, అంతర్గత ప్రజాస్వామ్యం లేక మా దగ్గరకు వస్తున్నారని వివరించారు. మా పార్టీ వ్యక్తుల మీద కాదు, సిద్ధాంతం మీద నడుస్తోందని చెప్పారు. శాస్త్రీయంగా సర్వేలు చేసి, అభ్యర్థుల విజయావకాశాలను అంచనా వేసి అధిష్టానం టికెట్స్ ఖరారు చేస్తుందన్నారు.

ముందే హామీలు ఇవ్వడం అనేది ఉండదని.. షర్మిల చేరిక మీద వార్తలు నేనూ చూశాను… అంతకు మించి సమాచారం లేదు… అధిష్టానం చూసుకుంటుందని వివరించారు భట్టి. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎపుడు బయట పడాలి అని చాలా మంది నాయకులు అనుకుంటున్నారని… అందుకే కాంగ్రెస్‌లో భారీగా చేరికలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో నీళ్ళు, నిధులు, నియామకాలు ఏదీ నెరవేరలేదని.. నా పాదయాత్రలో ప్రజల సమస్యలు ఎన్నో కళ్ళారా చూశానని చెప్పారు భట్టి.

Read more RELATED
Recommended to you

Exit mobile version