రైతు ఆత్మహత్య…కాంగ్రెస్ నాయకులను తప్పిస్తున్న ఖమ్మం పోలీసులు?

-

ఖమ్మంకు చెందిన రైతు ఆత్మహత్య కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకులను తప్పిస్తున్నారు ఖమ్మం పోలీసులు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుచరుడు కావడంతో అసలు నిందితుడిని ఏ10గా చేర్చారు పోలీసులు.

Bhojadla Prabhakar case update

తన ఆత్మహత్యకు కారణం కాంగ్రెస్ నాయకుడు కూ రపాటి కిషోర్ అని స్వయంగా రైతు భోజడ్ల ప్రభాకర్ చెప్పినా, ప్రభాకర్ తండ్రి వీరభద్రయ్య ఇచ్చిన ఫిర్యాదులో కిషోర్ పేరు ప్రధానంగా ప్రస్తావించినా.. ఎఫ్ఐఆర్‌లో అతడిని మాత్రం ఏ10గా చేర్చి కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.

కాగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతు భోజడ్ల ప్రభాకర్ ఘటనపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఈ ఘటనపై విచారణ చేసి కారకులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ గ్రౌండ్‌ స్థాయిలో ఈ పరిస్థితి కనిపించడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version