తెలంగాణ గ్రూప్‌-4 అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్‌..

-

 

తెలంగాణ గ్రూప్‌-4 అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్‌.. గ్రూప్ -4 ప్రిలిమినరీ కీని విడుదల చేసిన టిఎస్పిఎస్సి… కీపై అభ్యంతరాలను ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 4న సా. 5 గంటల వరకు స్వీకరించనుంది.

అయితే అభ్యర్థులు నేరుగా… పోస్ట్/మెయిల్ ద్వారా పంపిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోబోమని, కమిషన్ వెబ్సైట్ ద్వారా మాత్రమే అభ్యంతరాలను తెలియజేయాలని టిఎస్పిఎస్సి సెక్రెటరీ అనిత రామచంద్రన్ స్పష్టం చేశారు. అభ్యంతరాలకు సంబంధించిన ఆధారాలను పిడిఎఫ్ ఫార్మాట్ లో సమర్పించాలన్నారు.

కాగా, పేపర్-1 పరీక్షకు సంబంధించి 7,63,835, పేపర్ -2 పరీక్షకు సంబంధించి 7,61,028 మంది అభ్యర్థులు హాజరైయ్యారని వెల్లడించింది. పరీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ల కాపీలు సెప్టెంబర్ 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news