ఉప ఎన్నికకు ముందే మునుగోడులో టిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్

-

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో ప్రధాన పార్టీలన్ని ప్రచారం ముమ్మరం చేశాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, టీఆర్​ఎస్​లు ప్రత్యేకంగా భారీ బహిరంగ సభలు పెట్టి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.  తాజాగా మునుగోడులో అధికార టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.

మునుగోడుకు సంబంధించి నల్గొండ జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించిన రోజే కారు పార్టీకి జులక్ ఇచ్చారు సీనియర్ నేత. రాత్రికి రాత్రే జంపు కొట్టారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కమలం గూటికి చేరారు.

మునుగోడు నియోజకవర్గ సీనియర్ నాయకులు చండూరు జెడ్పిటిసి సభ్యులు కర్నాటి వెంకటేశం. అతనితో పాటు గట్టుపల్ ఎంపిటిసి అవ్వారి గీత శ్రీనివాస్, ఉడుతలపల్లి ఉపసర్పంచ్ గంట తులసయ్య బిజెపిలో చేరారు. కర్నాటి వెంకటేశం తో పాటు వందలాది మంది టిఆర్ఎస్ కార్యకర్తలు బిజెపిలో చేరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version