చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటి రష్మీ మృతి !

-

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం…చోటు చేసుకుంది. సినీనటి రష్మి మరణించారు.

సినీనటిగా, సీరియల్ ఆర్టిస్టుగా ప్రేక్షకులకు బాగా దగ్గరైన రష్మి, ఇక లేరనే వార్త ఇండస్ట్రీ వర్గాలకు దిగ్భ్రాంతికి గురి చేయగా, ప్రేక్షకులలో, ముఖ్యంగా ఆమె ఫ్యాన్స్ లో విషాదాన్ని నింపింది. ‘స్వంతం సుజాత’ అనే సీరియల్ లో సారమ్మ క్యారెక్టర్ ద్వారా పాపులర్ అయినటువంటి రష్మీ, సెప్టెంబర్ 18(ఆదివారం)న సాయంత్రం కన్ను మూసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. రష్మి జయగోపాల్ మలయాళం, తమిళ ఇండస్ట్రీలలో సినిమాలతో పాటు ఎన్నో సీరియల్స్ లో నటించారు. ప్రస్తుతం ఆమె వయసు 51 సంవత్సరాలు. కాగా, ఆమెకు భర్త జయ గోపాల్, కుమారుడు ప్రశాంత్ కేశవ ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version