అబిడ్స్ చిన్నారి కిడ్నాప్ కేసులో బిగ్ ట్విస్ట్..!

-

చిన్నారిని కిడ్నాప్ చేసిన వ్యక్తిని పోలీసులు 24 గంటలు కూడా గడవక ముందే పట్టుకున్నారు. హైదరాబాద్‌ కట్టెలమండిలో ప్రగతి అనే ఆరేళ్ల చిన్నారిని  కిడ్నాప్‌ చేశాడు దుండగుడు. శనివారం సాయంత్రం ఆడుకోవడానికి బయటకు వెళ్లిన చిన్నారిని కిడ్నాప్ చేసి ఆటోలో తీసుకొని వెళ్లాడు. చిన్నారి కనిపించకపోవడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సీసీ టీవీ కెమెరాలో కిడ్నాప్ దృశ్యాలు రికార్డు అయినట్లు తెలుస్తోంది. దీంతో కిడ్నాప్ కేసు నమోదు చేసి.. ఐదు బృందాలుగా బాలిక కోసం గాలించారు. ఆదివారం ఉదయం కిడ్నాప్‌ను పోలీసులు చేధించారు. ఆగంతకుడు బాలికను ఆటోలో ఎక్కించుకొని వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో అబిడ్స్ పోలీసులు ఐదు బృందాలుగా విడిపోయి.. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేశారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇనుమూల్ స్వగ్రామంలో కిడ్నాపర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తరలించారు. నిందితుడిని బిలాల్‌గా గుర్తించినట్లు తెలిపారు. కిడ్నాప్ ముందు రెక్కి నిర్వహించి, చిన్నారికి కిడ్నాప్ చేసాడు నిందితుడు బిలాల్.. చిన్నారికి సైకిల్ కొన్నిస్తాంటూ చిన్నారి కి మాయ మాటలు చెప్పాడు కిడ్నాపర్. చిన్నారి దగ్గర నుంచి తండ్రి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు నిందితుడు బిలాల్.

ముందు ఆటోలో ఎక్కించుకొని ఆ తర్వాత బస్సులలో నగర్ శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడు నిందితుడు. కిడ్నాపర్ బిలాల్ బాలికపై ఆత్యాచారం చేశాడని అనుమానిస్తున్నారు పోలీసులు. చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version