మునుగోడు లో బిజెపి మరో బహిరంగ సభ

-

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఇక మునుగోడు ఉపఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా మారడంతో ప్రధాన పార్టీలన్నీ మునుగోడుని హస్తగతం చేసుకోవడం కోసం వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నాయి. ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించాలని భావిస్తున్న బిజెపి ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి దిశా నిర్దేశం చేసింది. తెలంగాణలో పాగా వేయాలని ఉవ్విళ్ళూరుతున్న బిజెపి దూకుడు పెంచింది.

మునుగోడు లో ఇప్పటికే ఓ బహిరంగ సభ నిర్వహించగా.. మరో బహిరంగ సభ తో కొత్త ఉత్సాహాన్ని నింపాలని భావిస్తోంది. ఇక రెండో బహిరంగ సభలో బిజెపిలోకి భారీగా చేరికలు ఉంటాయని ప్రచారం కూడా సాగుతుంది. మునుగోడు ఉపఎన్నిక ఇన్చార్జిగా మాజీ ఎంపీ వివేక్ కు, పార్టీ శ్రేణులు, అభ్యర్థి సమన్వయకర్తగా మనోహర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఈ నెలాఖరులోనే మరో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బిజెపి నిర్ణయించింది. ఈనెల 5 వ తేదీ నుండి 7వ తేదీ వరకు తరుణ్ చుగ్, బండి సంజయ్ మునుగోడు లోనే బస చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version