అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ఔట్..బిజేపి కీలక నేత ఆత్మహత్యాయత్నం !

-

 

తెలుగు రాష్ట్రాల పార్టీ చీఫ్‌లను బీజేపీ అధిష్టానం..మార్చేసిన సంగతి తెలిసిందే. ఏపీ బీజేపీ చీఫ్‌గా దగ్గుబాటి పురంధేశ్వరిని నియమించిన బీజేపీ అధిష్టానం.. తెలంగాణ బీజేపీ చీఫ్‌గా జీ కిషన్ రెడ్డిను నియమించింది. అయితే.. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలకు అధ్యక్షులుగా ఉన్న సోము వీర్రాజు, బండి సంజయ్‌లకు మరో బాధ్యతలను అధిష్టానం కట్టబెట్టనుంది. అయితే.. ఈ సందర్భంగా.. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అనంతరం బండి సంజయ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

ఇది ఇలా ఉండగా, బండి సంజయ్‌ను బీజేపీ అధ్యక్ష పదవి నుండి తప్పించడంతో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు ఖమ్మం పట్టణం బీజేపీ ఉపాధ్యక్షుడు గజ్జల శ్రీనివాస్. ఈ మేరకు లేఖ రాసి, మరీ..బీజేపీ అధ్యక్ష పదవి నుండి తప్పించడంతో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు ఖమ్మం పట్టణం బీజేపీ ఉపాధ్యక్షుడు గజ్జల శ్రీనివాస్. అటు బండి సంజయ్‌ను రాజీనామా చేయడం జీర్ణించుకోలేక బీజేపీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు మొరిశెట్టి నాగేశ్వర్ రావు తన పదవికి రాజీనామా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version