లక్కీ లాటరీ తగిలి రేవంత్ సీఎం అయ్యాడు : కాసం వెంకటేశ్వర్లు

-

ఈ నెల 23, 24 తేదీల్లో మూసి పరివాహక ప్రాంతంలో 9 టీమ్ లు పర్యటిస్తాయి. 18 ప్లేస్ లలో ఎంపీ, ఎమ్మెల్యేల బృందాలు విసిట్ చేస్తాయి. అక్కడ ప్రజలకి భరోసా కల్పిస్తాయి అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నెల 25న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా కార్యక్రమం ఉంటుంది. హై కమాండ్ కు కప్పం కట్టేందుకు ప్రతినెలా ఎత్తులు వేస్తున్నారు రేవంత్ రెడ్డి. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మూసి మీద రేవంత్ రెడ్డీ పూటకో మాట మాట్లాడుతున్నారు. DPR ఇవ్వకుండా అఖిల పక్షం మీటింగ్ ఏంది. రేవంత్ రెడ్డిది బాలక్ బుద్ధి… మూసిలో అంబాడుతున్నట్టు ఉంది. లక్కీ లాటరీ తగిలి సీఎం అయ్యావు అని పేర్కొన్నారు.

అలాగే మూసి చరిత్ర నీకు తెలుసా అని ప్రశ్నించిన ఆయన.. ముస్కుందా మహర్షి పేరు మీద ఆ పేరు వచ్చింది. మూసి తీరంలో ఉన్న ప్రజలను ఇబ్బంది పెడితే బీజేపీ ఊరుకోదు… పోరాడుతుంది. నిన్ను , మీ కాంగ్రెస్ పార్టీ నీ మూసిలో ముంచుతాము. మూసి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా సుందరీకరణ చేస్తే మేము మద్దతు ఇస్తాం. మూసికి ఇరువైపులా రీటైనింగ్ వాల్ కట్టు అని సూచించారు వెంకటేశ్వర్లు.

Read more RELATED
Recommended to you

Exit mobile version