అశోక్‌నగర్‌లో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అరెస్ట్

-

హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో విద్యార్థిని ప్రవల్లిక ఆత్మహత్య విషయం తెలియడంతో బిజెపి నేత ఎంపీ డాక్టర్ కే. లక్ష్మణ్ ఘటన స్థలానికి చేరుకున్నారు. విద్యార్థిని రాసిన సూసైడ్ లెటర్ లో ఏం ఉందో చూపించాలని, హాస్టల్ లోపలికి అనుమతించాలని పోలీసులను కోరారు.

BJP MP Laxman arrested in Ashoknagar

అందుకు పోలీసులు అనుమతించకపోవడంతో అప్పటికే ధర్నా చేస్తున్న విద్యార్థులతో కలిసి ఆయన ధర్నాలో పాల్గొన్నారు. దీంతో లక్ష్మణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, హైదరాబాదులో గ్రూప్-2కు ప్రిపేర్ అవుతున్న ప్రవల్లిక రాసిన సూసైడ్ నోట్ కన్నీళ్లు తెప్పిస్తోంది. ‘నన్ను క్షమించండి అమ్మా! నేను చాలా నష్టజాతకురాలిని. నావల్ల మీరు బాధపడుతూనే ఉన్నారు. ఏడవకండి అమ్మా. జాగ్రత్తగా ఉండండి. మీకు పుట్టడం నా అదృష్టం. నన్ను కాళ్లు కింద పెట్టకుండా చూసుకున్నారు. మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నా. నన్ను ఎవరూ క్షమించరు. మీ కోసం నేను ఏం చేయలేకపోతున్నా’ అని లేఖ రాసి తనువు చాలించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version