గద్వాలలో దారుణం జరిగింది. యువకుడి ప్రాణాన్ని ట్రాన్స్జెండర్తో ప్రేమ వ్యవహారం బలిగొన్నది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గద్వాల పట్టణంలోని చింతలపేటకాలనీకి చెందిన బోయ నవీన్కు ట్రాన్స్జెండర్ పల్లవితో ప్రేమ ఏర్పడింది. అంతేకాదు…బోయ నవీన్, ట్రాన్స్జెండర్ పల్లవి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట.
రూంలు, హోటళ్లు, సినిమా, షికార్లు చేశారట బోయ నవీన్, ట్రాన్స్జెండర్ పల్లవి. అయితే.. బోయ నవీన్, ట్రాన్స్జెండర్ పల్లవి ప్రేమకు గుర్తుగా టాటూ కూడా వేయించుకున్నాడు నవీన్. తన ఛాతీపై పల్లవి టాటు కూడా వేయించుకున్నాడు. అయితే.. ఏమైందో తెలియదు కానీ.. తాజాగా పురుగుల మందు తాగి, చికిత్స పొందుతూ నవీన్ మృతి చెందాడు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. యువకుడి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.