ప్రజాస్వామ్య వ్యవస్థను కాలరాసింది బీఆర్ఎస్సే.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

-

ప్రజాస్వామ్య వ్యవస్థను కాలరాసింది బీఆర్ఎస్సే అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. కాంగ్రెస్ ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉందని కౌంటర్ ఇచ్చారు. ఒకవేళ ఉప ఎన్నికలే జరిగితే.. బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్స్ కూడా రావని తేల్చి చెప్పారు.

ప్రారంభం నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీనే అని కామెంట్ చేశారు. అవినీతి అక్రమాలకు మారు పేరు బీఆర్ఎస్ అని.. శాసన సభ పక్షాలను సైతం విలీనం చేసుకున్న చరిత్ర బీఆర్ఎస్ దే అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకోలేదా..? అని ప్రశ్నించారు. అప్పుడు అధికారంలో లేని పలువురు కాంగ్రెస్ నేతలను లాక్కోవడం ఏంటి..? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version