నేడు యాదాద్రికి బండి సంజ‌య్.. ప్ర‌త్యేక పూజ‌లు

-

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజ‌య్.. నేడు యాదాద్రికి వెళ్ల‌నున్నారు. యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ న‌ర‌సింహ స్వామిని బండి సంజ‌య్ ద‌ర్శించుకోనున్నారు. అదే విధంగా స్వామివారికి బండి సంజ‌య్ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఈ రోజు ఉద‌యం 8 గంట‌ల‌కు నాంప‌ల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాల‌యం నుంచి బండి సంజ‌య్… ప‌లువురు నాయ‌కుల‌తో యాదాద్రికి వెళ్ల‌నున్నారు. లక్ష్మీ న‌ర‌సింహ స్వామి వారికి ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌నున్నారు.

కాగ రేపటి నుంచి రెండో విడ‌త ప్ర‌జా సంగ్రామ యాత్ర ఉన్న నేప‌థ్యంలో లక్ష్మీ న‌ర‌సింహ స్వామి ఆశీస్సులు తీసుకోనున్నారు. బండి సంజ‌య్ చేస్తున్న ప్ర‌జా సంగ్రామ యాత్ర.. రెండో విడ‌త రేప‌టి నుంచి ప్రారంభం అవుతుంది. రేపు జోగులాంబ గ‌ద్వాల జిల్లా నుంచి బండి సంజ‌య్ పాద‌యాత్ర జ‌ర‌గ‌నుంది. రేపు అంబేద్క‌ర్ జయంతి నేప‌థ్యంలో ఆయ‌న‌కు నివాళ్లు అర్పించి పాద‌యాత్ర‌ను ప్రారంభించ‌నున్నారు. ఈ ప్ర‌జా సంగ్రామ యాత్ర రెండో విడ‌త పాద‌యాత్ర కోసం ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news