తెలంగాణలో నేటి నుంచి మరోసారి కుల గణన..ఈ నెంబర్లకు కాల్‌ చేయండి !

-

తెలంగాణలో ప్రజలకు బిగ్‌ అలర్ట్. నేటి నుంచి మరోసారి కుల గణన జరుగనుంది. కులగణనలో వివరాలు నమోదు చేసుకోని వారికి మరో అవకాశం కల్పించింది రేవంత్‌ రెడ్డి సర్కార్‌. దీంతో నేటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు మరోసారి కుల గణన జరుగనుంది. ఇందులో భాగంగానే… జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కాల్ సెంటర్ 040-21111111 ఏర్పాటు చేశారు.

cm-revanth-reddy

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాల్ సెంటర్ పని చేయనుంది. ఇప్పటి వరకు కుల గణన లో నమోదు కాని కుటుంబ సభ్యులు మాత్రమే కాల్ సెంటర్ కు కాల్ చేసి పూర్తి వివరాలు ఇవ్వాలని సూచనలు చేశారు అధికారులు. అలా కాల్‌ చేస్తే.. వెంటనే అధికారులు… మీ ఇంటికి వచ్చి… కుల గణన వివరాలు తీసుకుంటారు. ఎన్యుమరేటర్లు. మొబైల్ నెంబర్ తో సెర్చ్ చేసి సంబంధిత వ్యక్తి పాత డేటా బేస్ లో నమోదు అయ్యారా లేదా వివరాలు పరిశీలించనున్నారు అధికారులు. GHMC తో పాటు ఇతర జిల్లాల నుండి వచ్చిన కాల్స్ కూడా స్వీకరించి, ఆ వివరాలను సంబంధిత జిల్లా కలెక్టర్లకు ఫార్వర్డ్ చేయనున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version