ఆంబోతు మంత్రి అరుస్తూనే ఉంటాడు : చంద్రబాబు

-

టీడీపీ హయాంలో ఉద్యోగాలు వస్తే.. జగన్ గంజాయి తెచ్చారు. యువతను మత్తులో ఉంచి ఏమైనా చేయాలనుకుంటున్నారు. సైకిల్ ఎక్కడి జగన్ చైతన్యవంతులను చేయండి. ఆంబోతు మంత్రి అరుస్తూనే ఉంటారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారు. డయాంఫ్రం వాల్ కొట్టుకుపోయేలా చేశారు. హైదరాబాద్ వెలిగిపోతుంది.. అమరావతి వెలవెలబోతుంది. రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. పట్టి సీమను పాడుబెట్టారు. టమోటాకి పొటాటోకి తేడా తెలియని ముఖ్యమంత్రి వ్యవసాయం చేస్తాడా..? వ్యవసాయం గురించి తెలుసా అని తిరువూర్ సభలో హాట్ కామెంట్స్ చేశారు నారా చంద్రబాబు నాయుడు. 

మీ భవిష్యత్ కి నేను గ్యారెంటీ ఇస్తాను. రాష్ట్ర యువతను ప్రపంచంలో నెంబర్ వన్ గా మారుస్తానని పేర్కొన్నారు. జాతికి పెద్ద ఆస్తి యువత కన్నెర్ర చేస్తే ఎవ్వరూ బాగుపడరు. దొంగ ఓట్లు చేర్పించి గెలుస్తానని అనుకుంటున్నారు. ఐదేళ్లలో ప్రజల జీవితాలు ఏమి బాగుపడలేదు. రైతుల బతుకులు బాగు పడాలంటే టీడీపీ-జనసేన ప్రభుత్వం రావాలి. సైతాన్ ప్రభుత్వం పోవాలి.. రైతే రాజుగా మారాలి. మూడు నెలల్లో రైతు రాజ్యం వస్తుంది. ఐదేళ్లు ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version