ఆదివాసి సంఘాలతో సీఎం రేవంత్‌ భేటీ

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసి సంఘాలు భేటీ కావడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసీల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీ సంఘాలు భేటీ అయ్యారు. ఆదివాసీలు, మైనారిటీ వర్గాల మధ్య సఖ్యత కుదిర్చేందుకు మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చొరవతో రేవంత్ రెడ్డితో సమావేశం జరిగింది.

ఆదివాసీల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులను కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు. తమ భూములు, ఉద్యోగాలు తమకే దక్కేలా చూడాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరారు ఆదివాసీలు. దీపావళి లోపు అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి, డిమాండ్ల సాధ్యసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version