కుక్కల నుంచి తమను కాపాడాలంటూ పోలీస్ స్టేషన్ లో చిన్నారుల ఫిర్యాదు..!

-

వీధి కుక్కల బారి నుండి తమను కాపాడలంటూ.. కొంపల్లి మున్సిపల్ కమిషనర్, చైర్మన్ పై ఫిర్యాదు చేసేందుకు కొంతమంది చిన్నారులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి వచ్చారు. వారంతా.. కుత్బుల్లాపూర్ లోని  పలు కాలనీలకు సంబంధించిన చిన్నారులు కాగా.. రేవంత్ అంకుల్ ‘మా ప్రాణాలకు భరోసా ఏది’ అంటూ ప్రకార్డులతో నిరసన తెలిపారు. జంట నగరాలలో వీధి కుక్కల సమస్య తీవ్రమైంది. చిన్నారులపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరచి మరణానికి కారణమవుతున్నాయి.  చిన్నారులను బయటికి పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు.

కొంపల్లి మున్సిపాలిటీ NCL కాలనీలో గత రెండు రోజులలో ముగ్గురు పిల్లల్ని, ఒక పెద్దాయనని వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఈ ఘటనపై ఫిర్యాదు చేసినా.. మున్సిపల్ అధికారులలో చలనం లేదు. గత రెండు సంవత్సరాలుగా ఈ విషయమై పోరాడుతూనే ఉన్నా.. ఎన్సీఎల్ కాలనీలో మార్పులు జరిగాయి తప్ప ప్రయోజనం లేదు. పిల్లల్ని వీధి కుక్కలు పీక్కొని తినే పరిస్థితి వస్తుంది అని కాలనీ వాసులు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version