వనపర్తి కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గపోరు

-

వనపర్తి కాంగ్రెస్‌లో వర్గపోరు భగ్గుమంది. నిన్న జరిగిన వనపర్తి కాంగ్రెస్ సమావేశం రసాభస చోటు చేసుకుంది. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డిపై చిన్నారెడ్డి వర్గం దాడి చేసింది. దీంతో శివసేనారెడ్డి…సమావేం నుంచి మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. కొత్తగా చేరిన ఎంపీపీ మేఘారెడ్డిపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డిని మోసం చేసి వచ్చి ఇక్కడ అలాగే చేద్దాం అనుకుంటే కుదరదంటూ మహిళలు ఫైర్‌ అయ్యారు. నువ్వు పార్టీలోకి వచ్చి నాలుగు రోజులు కాకముందే టికెట్ ఎలా అడుగుతావ్ అంటూ ఎంపీపీ మేఘారెడ్డిని నిలదీశారు. అయితే… నిప్పు పెట్టి నిమ్మలంగా, నోరు మెదపకుండా కూర్చున్నారు చిన్నారెడ్డి. దీంతో అర్ధాంతరంగా కాంగ్రెస్‌ పార్టీ సమావేశం ముగిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version