పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో జరిగింది. హైదరాబాద్ నగరంలోని అల్వాల్, వెస్ట్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన మంజుల అనే మహిళ చిన్న కుమారుడు సంజయ్ కుమార్ (15) వర్గల్ ప్రభుత్వ బాలుర వసతి గృహంలో చదువుతున్నాడు.

పదవ తరగతి పరీక్షల అనంతరం సెలవులకు తన తల్లి దగ్గరికి వచ్చిన సంజయ్, పరీక్ష ఫలితాలు రెండు మూడు రోజుల్లో వస్తాయని అని తెలుసుకున్నాడు. దీంతో పరీక్షలో ఫెయిల్ అవుతాడనే భయంతో, ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు సంజయ్ కుమార్.