నేటి నుంచి BRS గా అవతరణ.. జెండా ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్

-

 

TRS పార్టీ జాతీయ పార్టీ గా మారింది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును..” భారత్ రాష్ట్ర సమితి ” గా ఆమోదిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ అధినేత సీఎం కెసిఆర్ అధికారికంగా లేఖ అందింది.

 

ఈ నేపథ్యంలో .. ఇవాళ మధ్యాహ్నం 1: 20 నిమిషాలకు దివ్య ముహూర్త సమయాన “భారత రాష్ట్ర సమితి” ఆవిర్భావం కార్యక్రమం నిర్వహించాలని, అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని, బిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

 

ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఇవాళ మధ్యాహ్నం1.20 నిమిషాలకు, తనకు అందిన అధికారిక లేఖకు రిప్లై గా సంతకం చేసి ఎన్నికల సంఘానికి అధికారికంగా పంపిస్తారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version