నేడు ముంపు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఏరియల్‌ సర్వే

-

వరంగల్ : నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 07.00 – 07.45 గంటలకు వరంగల్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి భద్రాచలం ప్రాంతంలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.

ఇక 09.30 గంటలకు భద్రాచలంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్‌. 09.45 గంటలకు హెలికాప్టర్ ద్వారా ములుగు జిల్లా ఏటూరునాగారం వరద ప్రభావిత ప్రాంతాల సందర్శన ఉండనుంది. 11.00 గంటలకు ఏటూరునాగారం ఐటీడీ ఏలో అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్‌. 11.45 గంటలకు ఏటూరునాగారం నుంచి హెలికాప్టర్ హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. కాగా.. ఇవాళ తెలంగాణ గవర్నర్‌ కూడా భద్రాచలంలో పర్యటించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version